Thursday, October 30, 2008

ఆహార నిద్రా మైథునాల్లాగే కవిత్వామూ

రోజులు బల్లపరుపుగా, నిస్సారంగా గడిచిపోతుంటాయి, ఆహార, నిద్రా, మైథున క్రియల్లో. ఎప్పుడో ఒకప్పుడు మనస్సులో విస్ఫోటనం జరుగుతుంది. సంవేదనలు సునిశితమౌతాయి. అనుభూతులు అతి సున్నితమౌతాయి. అప్పుడు కవిత్వం ఉద్భవిస్తుంది. ఐతే, నాకు కవిత్వం సద్యోగర్భం కాదు. అది పిండదశలో నవ మాసాలూ పెరగవలసిందే. నాకు కవిత్వ భావస్ఫురణ మాత్రం సంభోగాంత రేతస్ఖలనం వంటి అనివార్య, ఆనందదాయక, పతాక స్థితి.

మా హైస్కూల్ రోజుల్లో శ్రీపాద నరసింహమూర్తి అనే స్నేహితుడుండేవాడు. మా లెక్కల మాష్టారు బుచ్చన్న పంతులుగారి అబ్బాయితను. చాలా చురుకైనవాడు. మా ఇద్దర్నీ దగ్గిరగా చేర్చిందేమిటంటే పుస్తకాల పిచ్చి. కాకినాడలో ఇంటర్ పూర్తయాక ఇతను హైదరాబాద్ వెళ్లి నిజాం కాలేజ్‌లో చేరాడు. సెలవలకి అప్పుడప్పుడు కాకినాడ వస్తుండేవాడు. హైదరాబాద్‌లో తన కొత్త స్నేహితుల గురించీ, తను చదివిన కొత్త పుస్తకాల గురించీ ఆసక్తికరంగా చెబుతుండేవాడు. కొత్త స్నేహితుల్లో తన హీరో రాయప్రోలు సుబ్బారావుగారి అబ్బాయి శ్రీనివాస్. తమిద్దరూ కలిసి కనిపెట్టిన కొత్త పుస్తకాలూ, వాటిల్లో విషయాలూ చెబుతుంటే, నాకు ఆశ్చర్యంతో కళ్లు విప్పారేవి. ఒ్చఝ్ఛట ఒౌడఛ్ఛి, ఖీ.ఖి.ఉజూజ్టీౌ, గి.ఏ.అఠఛ్ఛీn, ఔౌఠజీట క్చఛి ూ్ఛజీఛ్ఛి, ఇజిజీటట్టౌఞజ్ఛిట ఐటజ్ఛిటఠీౌౌఛీ, ఈడజ్చూn ఖీజిౌఝ్చట నే నెన్నడూ వినని పేర్లు చెబుతుంటే, ఇంత సాహిత్య సామ్రాజ్యాన్ని కైవసం చేసుకున్న వీరి అదృష్టానికి అసూయపడేవాణ్ణి.

ఐతే, శ్రీనివాస్ రాయప్రోల్ ని చూసే అవకాశం అప్పుడు నాకు కలగలేదు. కాలేజి చదువు పూర్తి కాగానే వీరిద్దరూ కాలిఫోర్నియాలోని స్టాన్‌ఫర్డ్ యూనివర్సిటీలో ఇంజనీరింగు చదువుకోసమని వెళ్లారు. అమెరికాలో చదువుతుండగా శ్రీనివాస్‌కి ఉ.ఉ.ఇఠఝఝజీnజట,గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూ జ్చీఝట వంటి ప్రముఖ కవులతో పరిచయం కలిగింది. ముఖ్యంగా విలియమ్స్‌తో దీర్ఘకాలం ఉత్తరప్రత్యుత్తరాలు జరిగాయి. శ్రీనివాస్ పద్యా లు అ్టజ్చూn్టజీఛి కౌn్టజిజూడ వంటి ఉత్తమ తరగతి పత్రికల్లో ప్రచురింపబడ్డాయి. నరసింహూర్తి కూడా ఇజిటజీట్టౌఞజ్ఛిట ఖిటజీఞ్చఛ్చీ పేరుతో కథలు రాయటం ప్రారంభించాడు. చదువు పూర్తయ్యాక వీరిద్దరూ తిరిగొచ్చి ూజ్డ్చీఝ'ట ఖ్ఛిటఠిజీఛ్ఛి లో ప్రవేశించారు.

ఐతే, దురదృష్టవశాత్తు అనతికాలంలోనే, 1954లో, నరసింహమూర్తి కాలం చేశాడు. శ్రీనివాస్ సికందరాబాద్ నించి అతి వ్యయప్రయాసలతో ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట అనే సాహిత్య పత్రికను కొంతకాలం నడిపారు. ఇందులో ఒ్చఝ్ఛట ్కఠటఛీడ, ఏ్ఛnటడ కజీజూజ్ఛూట, గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట వంటి ప్రముఖ అమెరికన్ రచయితలు తమ రచనలు ప్రచురించారు. ఖఠ్ఛట్ట, ఐజూజూఠట్టట్చ్ట్ఛఛీ గ్ఛ్ఛిజుజూడ మొదలైన పత్రికల్లో కూడా అప్పుడప్పుడు శ్రీనివాస్ రచనలు చూస్తుండేవాణ్ణి. 1968లో ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట అనే కవితా సంకలనం, 1972లో క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి అనే సంకలనమూ కలకత్తాలోని గిటజ్ట్ఛీటట' గిౌటజుటజిౌఞ వారు ప్రచురించారు.

1974 వరకు నేను శ్రీనివాస్‌ని కలవటం జరగలేదు. మా మిత్రులు గిర్గ్‌లానీ మొదలైనవాళ్లూ, నేనూ కలిసి అn అn్టజిౌజూౌజడ ౌజ ఖ్ఛీజూఠజఠఉnజజూజీటజి ్కౌ్ఛ్టటడ అనే అనువాద కవితల సంకలనం వేసి, ఆవిష్కరణకి హైదరాబాద్ పట్టుకెళ్లాం. అప్పుడు పాతికేళ్లుగా వినికిడి మాత్రగా ఎరిగున్న నా అభిమాన కవి శ్రీనివాస్ రాయప్రోల్‌ని కలవటం జరిగింది! రోజులు బల్లపరుపుగా, నిస్సారంగా గడిచిపోతుంటాయి, ఆహార, నిద్రా, మైథున క్రియల్లో. ఐతే, ఎప్పుడో ఒకప్పుడు మనస్సులో విస్ఫోటనం జరుగుతుంది. సంవేదనలు సునిశితమౌతాయి. అనుభూతులు అతి సున్నితమౌతాయి. అప్పుడు కవిత్వం ఉద్భవిస్తుంది. ఐతే, నాకు కవిత్వం సద్యోగర్భం కాదు. అది పిండదశలో నవ మాసాలూ పెరగవలసిందే. ఐతే, నాకు కవిత్వ భావస్ఫురణ మాత్రం సంభోగాంత రేతస్ఖలనం వంటి అనివార్య, ఆనందదాయక, పతాక స్థితి అంటారు శ్రీనివాస్. కవిత్వం ఎందుకు రాస్తాను? నేను చెప్పదలచుకున్న దేదో ఈ మాటలు చెబుతాయని. ఎవరినో ఉద్ధరించటానికి కాదు. రాయటం నాకు ఆవశ్యకం.

ఆహార, నిద్రా, మైథునా లెలా ఆవశ్యకాలో, అలాగే అంటా రీయన. మన సాధారణ జీవితాలకి మెరుగుపెట్టే దైనందిన అనుభవాల గురించే శ్రీనివాస్ రాశారు: సంసారం, భార్యా, పిల్లలూ, తల్లితండ్రులూ, వాళ్ల వృద్ధాప్యమూ, స్నేహితులూ, ఆడెన్ వంటి అభిమాన కవులూ, తనకు నచ్చిన చిత్రకారులూ (పికాసో, జామినీ రాయ్), మధ్య వయస్కంతా పైబడుతున్న యేళ్లూ, చిన్నప్పటి జ్ఞాపకాలూ, పెద్దప్పటి దిగుళ్లూ- ఇంతకన్నా రాయటాని కేముంది? ఇదే కదా జీవితం. వెతికే వాడికి ఇందులోనే వజ్రాలు దొరుకుతాయి. ప్రసిద్ధ ఇండో - ఏంగ్లియన్ కవి ఈౌఝ కౌట్చ్ఛట ఏడాది క్రితం ఏజీnఛీఠ పేపర్‌లో శ్రీనివాస్ గురించి అద్భుతమైన ప్రశంస రాశాడు.

ఈయన చేసిన పొరపాటల్లా 20 యేళ్లు ముందుగా పుట్టటమూ, ఇంగ్లీషు సాహిత్య కేంద్రాలకు మారుమూల ప్రాంతమైన సికందరాబాద్‌ను వదలకపోవటమూనూ, ప్రస్తుతం ఇంగ్లీషులో రాస్తున్న భారతీయ కవులకు (వీళ్లని ఇండో-ఆంగ్లియన్ లంటారు) ప్రాచుర్యం లభిస్తోంది. ఇండో-ఆంగ్లియన్ రచన ఇప్పుడు ఫ్యాషన్‌గా మారింది. మరో సంగతేమిటంటే, ఇంగ్లీషు కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలంటే, సికందరాబాద్ వంటి మారుమూల పట్టణాల్ని వదిలి ఏ ముంబాయో, ఢిల్లీయో చేరుకోవాలి. (తెలుగు కవిత్వం రాసి పేరు తెచ్చుకోవాలనుకున్న వాళ్లు ఏ కాకినాడనో పట్టుకు కూచుంటే ఎలా? ఏక్షనంతా హైదరాబాద్‌లో వుంది!) ఆంధ్రప్రభుత్వంలో చీఫ్ ఇంజనీరుగా పనిచేసి, రిటైరై, సికందరాబాద్‌లో ఉంటున్నారు శ్రీనివాస్. ఇప్పుడు వయస్సు 73 ఏళ్లు. ఈయన కృతులన్నీ కలిపి 1995లో 'ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట ౌజ ఖిటజీnజీఠ్చిట ఖ్చడ్చఞటౌజూ' అని ప్రచురించారు కలకత్తాలోని గిటజ్ట్ఛీటట గిౌటజుటజిౌఞ వారు.

- ఇస్మాయిల్ 18.3.1998
(ఇది ఇస్మాయిల్ అముద్రిత రచన. రాయప్రోల్ జయంతి అక్టోబరు 25)

శ్రీనివాస్ రాయప్రోలు శ్రీనివాస్ రాయప్రోలు
(1925-1998) సికిందరాబాద్‌లో జన్మించారు. చదువూ స్వతంత్ర భావాలకు అమెరికా కారణమైనా, ఐదేళ్లపాటు (1956-61) నడిపిన ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట సాహిత్య పత్రికలో అమెరికన్ కవిత్వంలోని వెర్రిపోకడలను విమర్శించడానికి వెనుకాడలేదు. ఆ కారణంగానే ఆయన గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట లాంటి గొప్ప కవుల సాన్నిహిత్యం పొందగలిగారు.

ఆయన ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట (1968), క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి ్చnఛీ ్ౖటజ్ఛిట ్కౌ్ఛఝట (1974), ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట (1995) కవిత్వ పుస్తకాలను వెలువరించారు. చివరి పుస్తకంలో ముందుమాటలో.. తనను ఆకట్టుకునేది ఉట్టి కళా చాతుర్యం కాదు.. ఆలోచనల్లో అభివ్యక్తిలో పూర్తి నిజాయితీ.. ఏ కోశాన నటన లేకపోవడం అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒ్చఝ్ఛట గిటజీజజ్టి లాంటి కవుల కోవకు చెందినా ఇందులో తను విఫలమయ్యానని భావించారు. చివరికి ఆయన సికింద్రాబాద్‌లోనే కనుమూశారు. -ఊ్ఖఔఇఖ్ఖక, ఇ్చఝఛటజీఛీజ్ఛ పత్రిక, భారతీయ కవిత్వ విశేష సంచిక నుండిశ్రీనివాస్ రాయప్రోలు శ్రీనివాస్ రాయప్రోలు (1925-1998) సికిందరాబాద్‌లో జన్మించారు.

చదువూ స్వతంత్ర భావాలకు అమెరికా కారణమైనా, ఐదేళ్లపాటు (1956-61) నడిపిన ఉ్చట్ట ్చnఛీ గ్ఛిట్ట సాహిత్య పత్రికలో అమెరికన్ కవిత్వంలోని వెర్రిపోకడలను విమర్శించడానికి వెనుకాడలేదు. ఆ కారణంగానే ఆయన గిజీజూజూజ్చీఝ ఇ్చటజూౌట గిజీజూజూజ్చీఝట లాంటి గొప్ప కవుల సాన్నిహిత్యం పొందగలిగారు. ఆయన ఆౌn్ఛట ్చnఛీ ఈజీట్ట్చnఛ్ఛిట (1968), క్చటటజ్ఛీఛీ ఔౌఠ్ఛి ్చnఛీ ్ౖటజ్ఛిట ్కౌ్ఛఝట (1974), ఖ్ఛిజ్ఛూఛ్ట్ఛిఛీ ్కౌ్ఛఝట (1995) కవిత్వ పుస్తకాలను వెలువరించారు. చివరి పుస్తకంలో ముందుమాటలో.. తనను ఆకట్టుకునేది ఉట్టి కళా చాతుర్యం కాదు.. ఆలోచనల్లో అభివ్యక్తిలో పూర్తి నిజాయితీ.. ఏ కోశాన నటన లేకపోవడం అని పేర్కొన్నారు. ఈ విషయంలో ఒ్చఝ్ఛట గిటజీజజ్టి లాంటి కవుల కోవకు చెందినా ఇందులో తను విఫలమయ్యానని భావించారు. చివరికి ఆయన సికింద్రాబాద్‌లోనే కనుమూశారు.

ఊ్ఖఔఇఖ్ఖక, ఇ్చఝఛటజీఛీజ్ఛ పత్రిక, భారతీయ కవిత్వ విశేష సంచిక నుండి

Transformed using పద్మ v0.4.1. © 2004-2005 Nagarjuna Venna.


vividha : http://www.andhrajyothy.com/editshow.asp?qry=/2008/oct/27vividha1

No comments: