Wednesday, July 30, 2008

Student commits suicide because of forced English medium!

source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29state1

 

ఇంగ్లీషు మింగేసింది!
ిసబిఎస్‌ఇ పాఠాలు అర్థం కావడంలేదని
గురుకుల విద్యార్ధి ఆత్మహత్య

నర్సంపేట, జూలై 29 (ఆన్‌లైన్‌): ఆంగ్ల మాధ్యమ బోధన అర్థంకాక ఆం దోళన చెందుతున్న ఓ గురుకుల విద్యార్థి మంగళవారం పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన దాసరి వంశీ(10) వల్లభ్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిన వంశీ, ఇంటిపై బెంగపెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ ఆంగ్ల మాధ్యమ బోధనకు అతను ఇబ్బంది పడ్డాడు.

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచే ప్రారంభమైన ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలు, తనకు అర్థం కావడం లేదంటూ తమవద్ద వాపోయేవాడని సహచరులు తెలిపారు. తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా, వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు. వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు. ఘటన వివరాలపై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్‌ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు

siggu siggu

innayya gaarU caduvutunnaaraa?

 

source : http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29main53 

బాబు 'మీకోసం' యా త్ర
ఆపుతానన్నందువల్లే వర్షాలు: బొత్స

వరుణ యాగం వల్లనైతేనేం, కృత్రిమ వర్షాల వల్లనైతేనేం, చంద్రబాబు మీకోసం యాత్ర ఆపుతాను అన్నందువల్లనైతేనేమి.. వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతున్నందువల్ల విద్యుత్‌ కొరత కూడా తగ్గుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షాలు రాకపోవడానికి వ్యక్తులు కారణం అనడం ఎంతవరకు సబబన్న ప్రశ్నకు.. ఇవి మొదటినుండీ వస్తున్నవేనన్నారు. 'పొద్దున్నే లేవగానే ఎవరి మొఖం చూశామో అనేదానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తాం? బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ.. అంటుంటారు పెద్దలు. అంతెందుకు, చరిత్ర చూసుకుంటే ఈ నాలుగేళ్ల పాలనలో పడ్డట్టుగా పూర్తికాలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ వర్షం పడలేదు' అంటూ చెప్పుకొచ్చారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఎందుకు పడట్లేదన్న ప్రశ్నకు తాను ఈ రాష్ట్ర మంత్రినని, రాష్ట్రం వరకే పరిమితమవుతానని, బయటి రాష్ట్రాల గురించి మాట్లాడబోనని సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడటంపైన స్పందిస్తూ... ఆ పార్టీలకు విధానాలు, సిద్ధాంతాలు, దేశం తాలూకు అభివృద్ధి గురించి పట్టదని, కాంగ్రెస్‌ను ఓడించడమే సింగిల్‌ పాయింట్‌ అజెండాగా కలుస్తున్నాయని విమర్శించారు

Monday, July 28, 2008

How to: Attach to Managed Device Processes

How to: Attach to Managed Device Processes

కొత్త శోధన యంత్రం!

http://cuil.com

ఫలితాలు ఇంకా సరిగ్గా రావటంలేదు, కానీ ఫలితాల ప్రదర్శన విధానం అదుర్స్. ముఖ్యంగా వర్గాలు చూపడం కూడా..

ఇంకా తెలుగులో అణ్వేషించడం కలపలేదు :(

Thursday, July 24, 2008

Tuesday, July 22, 2008

(సశేషం)

ఓ రోజు,
వస్తాయనుకున్న మబ్బులు రాక
చల్లబడ్తాడనుకున్న సూర్యుడు అలాగే మండుతుంటే
అదృష్టవశాత్తూ రోడ్డు పక్కన బతికిపొయిన
గరర్నమెంటు చెట్టు నీడలో సేదతీరుతుంటే
నువ్వు మొదటిసారిగా కన్పించావు.

అంత ఏండలోనూ
నాలుగాకుల నీడ కింద
ఏడుపు లేకుండా నవ్వులేకుండా
నీ లోకంలో నువ్వాడుకుంటున్నావు.

ఎవరైనా వస్తారేమో అని చూసి,
ఎవరూ రాకపొయ్యేసరికి ఆశ్చర్యపొయి
భుజంపై వేసుకోని లాలించి
ఊరంతా తిరిగి చూసి
అందరికీ వివరించి చెప్పి
ఎవరికీ ఏమీ కానివాడవని
నాదగ్గరే ఉంచుకున్నాను.

అడుగులో అడుగు వేస్తూ
పడుతూ లేస్తూ నడుస్తుంటే
ఎంతో మురిసిపొయినాను.
గుండెలమీదుంచుకొని నిద్రోయినాను.

నిన్ను చూపించి సుద్దులు నేర్పుతుంటే,
ఊరంతా తిరిగి గొప్పలు చెప్పుకొని
ఎంతో మురిసి పొయినాను.

(సశేషం)

Monday, July 21, 2008

తెలుగు దేశం పార్టీ పని అయిపొయిందా?

>> ఒక్కొక్కరుగా వీడుతున్న సీనియర్లు
>> చిరంజీవి ప్రవేశం
>> కాంగ్రేస్ పార్టీ ధన బలం
>> మీడియా రాజకీయాల్లోకి కాంగ్రేస్, చిరంజీవి ప్రవేశం.
>> ఈనాడుపై తగ్గిన విశ్వాసం.
>> మారుతున్న కుల సమీకరణాలు
>> తెరాస తో పొత్తు ఉన్నట్టా? లేనట్టా?
>> గౌడ్ ? ఎత్తుగడా? ప్రారబ్దమా?

రాష్ట్రాన్ని , రాష్ట్ర రాజకీయాన్నీ ఓ మలుపు తిప్పిన తెలుగు దేశం పార్టీ ఇహ ఉండబోదా? కేవలం చరిత్ర పుస్తకాల్లోనే దాని గురించి చదవాలా? లేక పునర్జన్మ తీసుకుంటుందా?

చంద్రబాబు చేసిన తప్పేమిటి? కార్యకర్తలను నిజంగా అన్యాయం చేశాడా? రైతులను నిజంగా అన్యాయం చేశాడా? చంద్రబాబు చేసినవి రాష్ట్ర భవిష్యత్తుకు మంచా? చెడా?