Monday, September 29, 2008

ఐసీఐసీఐ వాడు పుట్టి ముంచుతాడంటారా? అయ్యో అయ్యో!

ప్రస్తుతానికయితే అలా అన్పించట్లేదు

కానీ?

బటి ఈజ్ ఎ బిట్ ఆఫ్ పాయిజన్

తెదేపా మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు

అడ్డులేని అవినీతి.. అంతులేని అశాంతి
చేతకాని ప్రభుత్వాలివి
మండిపడ్డ తెదేపా
మద్దతుగా యువ ఇంజనీర్ల సదస్సు
కె.పి.హెచ్‌.బి.కాలనీ, సెప్టెంబరు 28 (న్యూస్‌టుడే): దేశ శాంతిభద్రతలను కాపాడటంలో విఫలమైన కేంద్ర హోంశాఖ మంత్రి శివరాజ్‌పాటిల్‌ ఢిల్లీలో ఓ జోకర్‌లా తయారయ్యారని రాష్ట్ర మాజీ డీజీపీ, తెదేపా నాయకుడు పేర్వారం రాములు విమర్శించారు. తెదేపాకు మద్దతుగా మనకోసం తెలుగుదేశం అంటూ యువ ఇంజనీర్లు ఆదివారం కేపీహెచ్‌బీ కాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో నిర్వహించిన సదస్సులో ఆయన ముఖ్యఅతిధిగా ప్రసంగించారు. ఈసందర్భంగా రాములు మాట్లాడుతూ కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాల పనితీరుపై తీవ్ర విమర్శలు చేశారు. ప్రస్తుతం రాష్ట్రంలో అవినీతి ఆశ్రిత పక్షపాత రాక్షస పాలన కొనసాగుతోందన్నారు. ముఖ్యమంత్రి తాబేదార్లకు ప్రభుత్వ భూమిని ధారాదత్తం చేస్తున్నారని ధ్వజమెత్తారు. మరోసారి కాంగ్రెస్‌ అధికారంలోకి వస్తే రాష్ట్రాభివృద్ధి కోసం అంగుళం భూమి కూడా మిగలని హెచ్చరించారు. సెజ్‌ల పేరుతో పేదల భూమిని పెద్దలకు దోచిపెడుతోందన్నారు. కిందిస్థాయి ఉద్యోగుల అవినీతిపై కొరడా ఝళిపించే ప్రభుత్వం ఐఎఎస్‌, ఐపిఎస్‌ల స్ధాయిలో జరిగే అవినీతిని మాత్రం అసలు పట్టించుకోవడంలేదని రాములు ధ్వజమెత్తారు. రాష్ట్రంలో కేంద్రలో శాంతిభధ్రతలు పూర్తిగా కనుమరుగయ్యాయని, ప్రభుత్వాలు దిక్కుతోచని స్థితిలో ఉండిపోయాయని విమర్శించారు. సదస్సు ఏర్పాటు చేసిన ఇంజనీర్లను ఆయన అభినందించారు. పారిశ్రామికవేత్త నామా నాగేశ్వరరావు మాట్లాడుతూ మన ఇంటిని, కుటుంబాన్ని కాపాడుకున్నట్టే మనరాష్ట్రాన్నికూడా చేతకాని ప్రభుత్వం నుంచి మనమే ప్రస్తుతం కాపాడుకోవాల్సిన అవసరం ఏర్పడిందన్నారు. రాష్ట్రంలో ఐటీ విప్లవం తెదేపా వల్లే జరిగిందన్నారు. శాస్త్రవేత్త చందు సాంబశివరావు మాట్లాడుతూ అభివృద్ధి ఫలాలు అందరికీ అందాలన్నా, సామాజిక న్యాయం జరగాలన్నా తెదేపా వల్లే జరుగుతుందన్నారు. ఐటి నిపుణుడు సతీష్‌ మాట్లాడుతూ ప్రపంచంలో తెలుగువారికి ఐటి రంగంలో గుర్తింపును చంద్రబాబు తెచ్చారన్నారు. సదస్సులో యువ ఇంజనీర్లు తెదేపా చేట్టిన కార్యక్రమాలు, కాంగ్రెస్‌ హయాంలో జరిగిన అవినీతిని స్త్లెడ్స్‌ ద్వారా ప్రదర్శించి ఆకట్టుకున్నారు. మేలుకో యువత, కాపాడుకో రాష్ట్రభవిత వంటి నినాదాలతో హోరెత్తించారు. ఇంటిలోని ప్రతిఒక్కరూ తమోటుహక్కును వినియోగించుకోవడంతోపాటు కుటుంబసభ్యులందరినీ ఓటుహక్కు వినియోగించుకోనేలా చూడాలని కోరారు.

source eenaadu Hyd district news.

మన కోసం తెలుగు దేశం ఫోటోలు


ఆడిటోరియం అలంకరణ
పెద్దలు




జ్యోతి ప్రజ్వలన
వ్యాఖ్యాత
పిన్నలు
నామా నాగేశ్వరరావు గారు
శ్రీనివాస రెడ్డి గారు
నాసా వేత్త


హాల్ ఫుల్ (ఆల్మోస్ట్) ఓ వెయ్యి మంది వరకూ వచ్చారు అని అంచనా.

పిన్నలు
అన్నగారి ఆశీర్వాదాలు


ఐటీ రకతం

Sunday, September 28, 2008

టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌

రాష్ట్రంలో అవినీతిదే ప్రదమ స్థానం

కేపీహెచ్‌బీకాలనీ, ఆన్‌లైన్‌: తెలుగుదేశం పార్టీకి మద్ధతుగా యువత సమర శంఖం పూరించడం హర్షించదగ్గ పరిణామమని మాజీ డీజీపీ పేర్వారం రాములు అన్నారు. టీడీపీకి మద్ధతుగా రాష్ట్ర యువ ఇంజనీర్ల అసోసియేషన్‌ ఆధ్వర్యంలో ఆదివారం కేపీహెచ్‌బీకాలనీలోని ఐమాక్స్‌ గార్డెన్స్‌లో భారీ సదస్సును నిర్వహించారు. అంతకు ముందుకు వివిధ రంగాలకు చెందిన యువ ఇంజనీర్లు భారీ ర్యాలీ నిర్వహించారు. సదస్సుకు పేర్వారం రాములు ముఖ్య అతి«థిగా హాజరయ్యారు.

ఈ సందర్భంగా మాట్లాడుతూ రాష్ట్రంలో ప్రస్తుతం అభివృద్ధి కంటే అవినీతి ముందంజలో ఉందని విమర్శించారు. బందుగణం, అనుచరుల ద్వారా వైఎస్‌ అవినీతికి పాల్పడుతున్నాడని ఆరోపించారు. ఈ విషయంలో కింది స్థాయి ఉద్యోగులే బలవుతున్నారు తప్ప ఉన్నతస్థాయిఅధికారులు, రాజకీయ నాయకులు పట్టుబడ్డ దాఖలాలు మాత్రం లేవన్నారు. ఉగ్రవాదంతో పాటు లా అండ్‌ అర్డర్‌ విషయంలో యూపీఏ ప్రభుత్వం పూర్తిగా విఫలమైందన్నారు.

ప్రముఖ పారిశ్రామిక వేత్త నామా నాగేశ్వర్‌రావు మాట్లాడుతూ తెలుగువాడి ఆత్మగౌరవాన్ని నిలబెట్టిన ఎన్టీఆర్‌ను స్ఫూర్తిగా తీసుకుని నేటి యువత ముందుకు సాగాలన్నారు. ఫోర్‌ సాఫ్ట్‌ అధినేత శ్రీకాంత్‌రెడ్డి ప్రసంగిస్తూ ఓటు అనే ఆయుధంతో యువత రాజకీయాల్లో క్రియాశీలక పాత్ర పోషించాలని, చంద్రబాబును తిరిగి అధికారంలోకి తీసుకురావడానికి కృషి చేయాలని పిలుపునిచ్చారు. వచ్చే ఎన్నికల్లో ప్రజల్లో చైతన్యం తెచ్చి టీడీపీని తిరిగి అధికారంలోకి తెస్తామని యువ ఇంజనీర్లు ప్రతిజ్ఞ చేశారు

news source andhrajyothy

మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత

రాష్ట్రంలో ఐటీ ఆద్యుడు చంద్రబాబే
ఆయన సేవలు రాష్ట్రానికి అవసరం
ఇంజినీర్ల మద్దతు
హైదరాబాద్‌, న్యూస్‌టుడే: ''ఐటీ రాష్ట్రంగా ఆంధ్రప్రదేశ్‌కు ఇంత గుర్తింపు లభిస్తోందంటే అందుకు తెదేపా అధినేత చంద్రబాబే కారణం. మళ్లీ ఆయనను అధికారంలోకి తీసుకురావడానికి మనమంతా శక్తి వంచన లేకుండా కృషి చేద్దాం'' అని యువ ఇంజినీర్లు పేర్కొన్నారు. ఊరూరా తిరిగి ఆయన పాలనా దక్షతను చాటిచెప్పాలని నిర్ణయించారు. 'మన కోసం తెలుగుదేశం', 'మేలుకో యువత-కాపాడుకో రాష్ట్ర భవిత' సందేశంతో ఆదివారమిక్కడి ఐమాక్స్‌ గార్డెన్‌లో ఇంజినీర్లు సదస్సు నిర్వహించారు. ఈ సందర్భంగా వారు మాట్లాడుతూ.. ''చంద్రబాబు పదేళ్ల కిందట ఐటీ పరిశ్రమను రాష్ట్రానికి తీసుకొచ్చేందుకు హైటెక్‌ సిటీ నిర్మిస్తుంటే అది భూత్‌బంగ్లా అని విమర్శించారు. నాడే సాంకేతిక పరిజ్ఞానాన్ని ఉపయోగించి బాబు ఉన్నతాధికారులతో టెలీ, వీడియో కాన్ఫరెన్స్‌లు నిర్వహిస్తే ఎద్దేవా చేశారు'' అని వారు వ్యాఖ్యానించారు. రాష్ట్ర వ్యాప్తంగా ఇలాంటివి మరిన్ని సదస్సులు నిర్వహించి అందరికీ అవగాహన కల్పించాలని నిర్ణయించారు.

ఐఏఎస్‌, ఐపీఎస్‌ల అక్రమార్జన: పేర్వారం
కొందరు ఐఏఎస్‌, ఐపీఎస్‌ ఉన్నతాధికారులు అక్రమార్జనలతో స్విస్‌ బ్యాంకులో పెద్ద ఎత్తున సొమ్ము దాచుకుంటున్నారని సదస్సుకు ముఖ్య అతిథిగా హాజరైన మాజీ డీజీపీ పేర్వారం రాములు ఆరోపించారు. వారిని వదిలేసి చిన్నమొత్తంలో లంచాలు తీసుకుంటున్న చిరు ఉద్యోగులపైనే ప్రభుత్వం చర్యలు తీసుకుంటోందని విమర్శించారు. సెజ్‌ల పేరిట భూములను ధారాదత్తం చేసుకుంటూపోతే రాష్ట్రంలో సెంటు భూమి మిగలదని చెప్పారు.


news from eenadu.net


related links:

http://groups.google.com/group/manakosamtelugudesam


http://www.manakosam-telugudesam.blogspot.com/

Friday, September 26, 2008

ఎవరిది త్యాగం?

ఈ మధ్య ఎవరో అంటున్నారు.

అతెలంగాణా జనాలు త్యాగ మూర్తులు అని. వారు అన్నీ కోల్పోతున్నా, తెలంగాణా వాళ్లు అవమానిస్తున్నా, భరిస్తూ కేవలం రాష్ట్రం కలిసి ఉంటే చాలు అని అన్ని త్యాగాలూ చేస్తున్నారు అని.

నా ఉద్దేశ్యంలో అసలు త్యాగ మూర్తులు తెలంగాణా వారే.

దళితులకు జరిగినట్టు అడుగడుగునా అవమానం జరుగుతున్నా భరిస్తూ ఏదోలే మన తెలుగు వాడే కదా అని కలిసి ఉంటున్నందుకు తెలంగాణా వాళ్లే పేద్ద త్యాగ మూర్తులు.

హైదరాబాదులో ఓ చిన్న బాబు కి వాళ్లమ్మ రోడ్డుపై దర్జాగా చెప్పే మాట "మనం అలా చెప్పిండ్రు అని అన కూడదు. చెప్పాడు అనాలి" (సరిగ్గా గుర్తు లేదు కానీ ఇటువంటి మాటే ఏదో)

ఏ తెలంగాణా వాడన్నా అతెలంగాణా విధ్యా సంస్థలో చేరితే ముందు భాషను అవమానిస్తుంటే భరించడం అలవాటు చేసుకోవాలి. అలా ఎవరికన్నా తెలంగాణాలో జరిగిందా? అయినా ఎందుకు కలిసి ఉంటున్నారు? ఎందుకంటే మెజార్టీ తెలంగాణా జనాలు త్యాగ మూర్తులు కాబట్టి.

అసలు మెజార్టీ తెలంగాణా వాళ్లు ప్రత్యేక రాష్ట్రం కావాలంటే ఎప్పుడో వచ్చేది. కేవలం తెలంగాణా ప్రజల సమైఖ్య రాష్ట్ర కాంక్ష వల్లనే ఇంకా రాష్ట్రం కలిసి ఉంటుంది.

ఈ సారి ఎప్పుడన్నా ఎవడి బాసనన్నా ఎక్కిరించేముందు, పల్లీలంటారు, గాడిద గుడ్డంటారు, అని అనే ముందు ముందు చూపుతో ఆలోచించండి.

Thursday, September 18, 2008

మా తాత గురించి చరిత్ర పుస్తకంలో లేదేమిటి?

కరడు కట్టిన గుడ్డి తెలంగాణా వాది మన నవీన్ ఆచారి గారు బ్లాగు మొదలుపెట్టారు. వివిధ పత్రికలు మొన్నగు చోట్ల తెలంగాణాకు అనుకూలంగా వచ్చిన వ్యాసాలు కాపీ పేస్ట్ చేయడమే కాకుండా అప్పుడప్పుడూ తన కీబోర్డుకు కూడా పని చెపుతూ ఉంటారు. వారి బ్లాగుకు స్వాగతం.

అనుభవ పూర్వకంగా నేర్చుకున్నదేమిటంటే కొన్ని బ్లాగులపై కామెంటడం దండగ! దాని బదులు మరో బ్లాగులో రాసుకోవడం శుభ్రం. అటువంటి వాటిలో తాబాసు గారి బ్లాగు కూడా ఒకటి అనుకోండి. కాకపోతే ఆ విషయాన్ని ఆయన హుందాగా కామెంటే ముందే ఎర్ర అక్షరాలతో వ్రాశారు. నెనర్లు :)

తెలంగాణ రైతాంగ పోరాటం పాఠ్య పుస్తకాల్లో లేదెందుకు..? - నవీన్ ఆచారి

ఈ వ్యాసంలో ఇలా ప్రశ్నించారు కదా, దీనిని సమాధానం నవీన్ ఆచారి గారి దగ్గర లేదంటారా? ఉంది కానీ చూడటం ఇష్టంలేదు. ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

పీవీ నరసింహ రావు గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు పెట్టినట్టు? వారిది తెలంగాణా కాదా?

ప్రకాశం పంతులు ఉదాహరణ ఇచ్చారు, అతన్ని పాఠ్యపుస్తకాల్లో పెట్టడానికి కారణం కాంగ్రేస్ వాది అనే కానీ, కోస్తా వాడు అనో, తెలంగాణా వాడు కాదు అనో నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పాను కదా "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది" అని.

రైతాంగ పోరాటం గురించి పాఠ్యపుస్తకాల్లో ఎందుకు లేదు? కారణాలు నవీన్ ఆచారికి తెలీదా?
1. ముస్లిం సోదరులు ఇబ్బంది పడతారు అనీ (లేకపోతే వారి వోట్లు పోతాయని)
2. వివాదాస్పదమైన విషయం అనవసరంగా గెలుక్కోవడం ఎందుకనీ

అంతే కానీ అది తెలంగాణాలో మాత్రమే జరిగిందనీ, కోస్తాలో జరగలేదని కాబట్టి పఠ్యపుస్తకాల్లో పెట్టలేదనే విషయం నవీన్ ఆచారికి తెలీదా? తెలుసు కానీ ముందే చెప్పుకున్నట్టు "కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాది".

అన్నట్టు దున్నపోతు ఈనిందంట తెలుసా?

తెలుసు ఇదంతా కోస్తా వాళ్ల కుట్ర. ప్రత్యేక తెలంగాణా కావాలి. తెలంగాణ ఆత్మ గౌరవం కావాలి, అప్పుడే తెలంగాణాలో దున్నపోతులు ఈనకుండ ఉంటాయి. అని చెపుతారు ఈ కరడు కట్టిన + గుడ్డి + తెలంగాణా వాదులు.

శుభం.

Monday, September 15, 2008

Book Review: Wizard's First Rule

In the beginning it is white.
For the first half of the book it is black
Then it turned to Red
Then more Red
In the end it is quite
overall it is nice read.

http://en.wikipedia.org/wiki/Wizard%27s_First_Rule

Friday, September 12, 2008

Idea! Please stop this non sence

Learning English is not education. I feel very much insulted each time I watch one of your crappy adds. You may be educated in English but learning English itself is not education.

You directly show as if any language other than English is CRAP! How the hell you think like that?

Also with the noise and signals of your IDEA there is no way people can learn from distance, if not from next room!

Idea, I hate these adds from you. BTW I moved away from idea to airtel to show my detest of this publicity.

Takre, we need you.



View : http://www.ideacellular.com/IDEA.portal?_nfpb=true&_pageLabel=IDEA_Page_Advertisements&displayParam=IdeaSchool.html

Wednesday, September 10, 2008

నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

ముందు వారు 'బూతు ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది మంచి బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు 'మూఢ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అమూఢ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' కుల ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'అభ్యుదయ ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


తరువాత వారు ' ప్రాంతీయ ' బ్లాగులంటూ కొన్ని తొలగించారు.

నాది 'సమైఖ్య ' బ్లాగు కదా అని ఊరకున్నాను.


ఇప్పుడు ' నా బ్లాగు ' నే తొలగించారు.

చుట్టూ చూస్తే నోరు విప్పే వారెవరూ కన్పించలేదు.

Tuesday, September 9, 2008

నమ్మలేని నిజాలెన్నో

ఇన్నాళ్లూ మనసు అద్దంలో
నన్ను నేను పరికిస్తూ,
సూపర్ గా ఉన్నా అనుకుంటున్నా!

ఇవ్వాల నిజ అద్దంలో చూస్తుంటే
నమ్మలేని నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

తెల్లబడ్డ జుట్టు,
నల్లబడ్డ పెదాలు,
ముడతలు పడ్డ మొఖం,
కళ్ల ముందు బూతద్దాలు
పెద్ద చైనా గంటలా ఒళ్లు!
నిజాలెన్నో కన్పిస్తున్నాయి.

ఇన్నాళ్లూ
ప్రేమ, స్నేహం
కోపం, నవ్వు
మాట, పాట
అన్నీ ఎత్తులే అనుకుంటూ
ప్రయోగిస్తూ విజయాల మెట్లెక్కుతూ
సూపర్ అనుకుంటున్నా.

ఇవ్వాల క్రిందికి చూస్తే
వదిలేసిన చెప్పులూ
విసిరేసిన గొడుగులూ
ఆవల వేసిన వస్త్రాలూ
అందనంత దూరంలో కన్పించాయి.
ఎండా, వానా
కష్టాల్, కష్టాల్
తోడై నిల్చాయి.

రేడియోతో పాడించీ పాడించీ
పొడిబారిపొయిన బ్యాటరీల్లా
ఎవరికోసమో, ఎవరితోనో
ఏదో చేయించి వాడిపొయిన
నిజ రూపం కన్పించింది.

Friday, September 5, 2008

సెమార్గ్ (కవాకటి)

సెమార్గ్ (కవాకటి)
పెదరాయుడు గారు తన ఎదురుగా కూర్చున్న సుందరాం, గ్యాంగద్ ల వైపు
మరోసారి చూసి టీ త్రాగడం అయిపోచేసి ఇహ మొదలు పెట్టండి అన్నట్టు
చూశాడు.
ముందుగా సుందరాం మొదలుపెట్టాడు. "ఈ సంవత్సరం మొదటి మూడు నెళ్లు ఇట్టే
గడిచిపొయ్యాయి. మొన్న మొన్ననే మన మొదటి సంవత్సరం మీటింగ్ లో
కూర్చున్నట్టుంది. ఈ మూడు నెళ్ల ఫలితాలు ఇప్పుడు మీ ముందు ఉన్నాయి.
నిజాలు చేదుగా ఉన్నా చెప్పుకోవాలి కదఈ కదా!
ఈ మూడు నెళ్ల ఫలితాలు ఏ మాత్రం ఆశాజనకంగా లేవు. ఇలాగే
కొనసాగితే మనం టార్గెట్ చేరుకోవడం అటుంచి కనీసం పొయిన సంవత్సరం
వచ్చిన ఆదాయం కూడా రాకపోవచ్చు".
గ్యాంగద్ తల వంచుకొని తన లాప్టాప్ వైపు చూడసాగాడు. పెదరాయుడు
మొఖంలో ఎటువంటి భావాలూ లేవు.

సుందరాం మాట్లాడటం కొనసాగించాడు.

"సమస్యల మీద సంస్యలు!
మనం ఒప్పందం చేసుకున్న ప్రాంతంలో వరదలవల్ల దిగుబడి తగ్గింది.
వెరే చోటనుండి ఎక్కువ ధరకు కొనాల్సి వచ్చింది. గోరు చుట్టమీద
రోకటి పోటులా మనం ఒప్పందం చేసుకున్న రైతులు ఎక్కువ ధర, ఇన్సూరెన్స్
మొన్నగు 14 విషయాల గురించి పోరాడుతున్నారు.

కాంపిటీషన్! మన దారిలో ఇంకో ముగ్గురు కూడా హైదరాబాద్ నిండా షాప్
లు ఓపెన్ చేశారు. అయితే వీటన్నిటికంటే పెద్ద పోటీ రైతు బజార్ల నుండి
వస్తుంది. ఇప్పటికీ మన హైదరాబాద్ కూరగాయల అమ్మకాల్లో మెజార్టీ
వాటా రైతు బజార్లదే!

వేస్టేజ్!! మొత్తం 20% వరకూ మనం కొన్న కూరగాయలు వేస్ట్ అయ్యాయి.

మొత్తం దృష్టిలోకి వచ్చిన సమస్యలన్నీ ఈ పీపీటీ లో ఉన్నాయి. పైన
చెప్పిన మూడూ మనల్ని ముందుకు వెళ్లకుండా ఆపిన వాటిలో ముఖ్యమైనవి."
.......................
అప్పటికీ పెదరాయుడు ఏమీ మాట్లాడలెదు. మొఖంలో ఏ భావాలూ లేవు.
నింపాదిగా గ్యాంగద్ వైపు చూశాడు.
గ్యాంగద్ గొంతు సవరించుకొని మాట్లాడటం మొదలుపెట్టాడు.
"ఒక ఇంట్రెస్టింగ్ అబ్జర్వేషన్. మొహంపై ఏసీ గాలి తగిలే చోట ఉన్న
కూరగాయలు ఎక్కువగా సేల్ అవుతున్నట్టు తేలింది. మన వాళ్లు దీన్ని
ఉపయోగించుకొని వేస్టేజ్ కొంత వరకు తగ్గించుకోవచ్చనుకుంటాను. "

పెదరాయుడు, సుందరాం లు తల ఊపారు. ఇంకా ఏమన్నా మాట్లాడతాడేమో
అని ఎదురు చూశారు. గ్యాంగద్ కొంచెం సేపు తనలో తాను ఆలొచించుకొని
నా దగ్గరో ఐడియా ఉంది. అంటూ మొదలుపెట్టాడు.
"మన నగర పరిసరాల్లో నుండే కూరగాయలు హైద్ కి ఎక్కువగా
వస్తుంటాయి. అయితే వీటిని ఎక్కువగా మురికి నీటితో పండిస్తున్నారు. లేదా
కనిపించడానికి నీళ్లు బాగానే ఉన్నా హైద్ కెమికల్స్ కలిసిన నీటితో
పండిస్తున్నారు. వీటి వల్ల ఆ కూరగాయలు ఎక్కువగా
అనారోగ్యకరమైనవి.

వీటికి సమాధానంగా ఆర్గానిక్ ఫుడ్ కాన్సెప్ట్ వచ్చింది. కానీ అది
కేవలం అత్యున్నత వర్గాలకి మాత్రమే అందుబాటులో ఉంది. మధ్య
తరగతికి ఏది ఆరోగ్యకరమైనదో , ఏది అనారోగ్యకరమైనదో తెలీదు.
మనకి ఇక్కడ చాలా మంచి మార్కెట్ ఉంది. అంటే మనం కృష్ణా,
గోదావరి, గంగా, యమున వంటి నదుల స్వచ్చమైన నీటితో పండించిన
కూరగాయలు మాత్రమే అమ్ముతామన్న మాట. వీటిని సెమీ ఆర్గానిక్ ఫుడ్
లేదా సింపుల్ గా సెమార్గ్ అని పిలవొచ్చు. వీటివల్ల మనకి
కాంపిటీటర్లపై ఎడ్వాంటేజ్ వస్తుంది. రైతు బజార్ ల నుండి
మధ్యతరగతిని మరీ ముఖ్యంగా నవీ మధ్య తరగతిని వేరు చెయ్యవచ్చు. "

------

పెద రాయుడు, సుందరాం ల కళ్లలో ఓ మెరుపు మెరిసింది. ఆ ఐడియాకున్న
వాల్యూ వాళ్లిద్దరికీ వెంటనే అర్థం అయింది. వరదలో చిక్కుకున్న
వారికి ఆసరా దొరికినట్టయింది.

-------

ఆ రూంలో మొత్తం ఆరుగురు ఉన్నారు. పెద రాయుడు, గ్యాంగద్, సుందరాం
లతో పాటు మరో మూడు కొత్త మొఖాలు ఉన్నాయి.

" ఈ ఐడియా పంజేస్తుందంటావా?" ఓ కొత్త మొఖం ప్రశ్నించింది.
"బంగారంలా! మన వాళ్లు తెలివైన వాళ్లే కానీ, మరీ అంత తెలివైన
వాళ్లు కాదు. ఇంకో ముక్కలో చెప్పాలంటే తెలివైన వాళ్లు అనుకుంటారు. "
అప్పటికీ ఆ కొత్త మొహంలో ఎటువంటి శాటిస్ ఫ్యాక్షన్ కంపించలేదు.
సుందరాం ఆ మొహం చూసి మాట్లాడటం కొనసాగించాడు.
"అక్కడి దాకా ఎందుకు, మన కేస్ స్టడీ ఫైవ్ చూడండి. లవర్ కారం
వాళ్లు మార్కెట్లోకి వచ్చే నెల రోజుల ముందు విజయవాడ, గుంటూరు లలోని
కారం ఫ్యాక్టరీల గురించి తమ పెపర్లో అన్నీ నిజాలే వ్రాశారు. ఆ
తరువాత వాళ్లు రిలీజ్ చేసిన లవర్ కారం మెజార్టీ వాటా చాలా
సులువుగా పొందింది."
అప్పటికీ కొత్త మొహంలో కొంత శాటిస్ ఫ్యాక్షన్ కంపించింది. మరింగ డ్రాగ్
చెయ్యడం ఇష్టం లేనట్టు అంగీకార సూచకంగా తల ఊపాడు.
సుందరామే మాట్లాడసాగాడు. "ముందుగా అనుకున్నట్టే మనం ఈ
అనారోగ్యకర పంటలపై చేస్తున్న పరిశోధనలకు మన మన సబ్ యూనిట్ల
నుండి ఫైనాన్స్ చెయ్యాలి. ఆ తరువాత వాటి గురించి ప్రపంచ
వ్యాప్తంగా మీడియాలో ప్రముఖంగా కవర్ అయ్యేట్టు చూడాలి. ఆ తరువాత
సరి అయిన సమయంలో మన సెమార్గ్ ప్రొడక్ట్స్ రిలీజ్ చెయ్యాలి. చాలా
పాజిటివ్ గా ప్రచారం చెయ్యాలి. నిజానికి ఇది మనకు కత్తి మీద
సాము. తస్మాత్ జాగురూకతతో ముందుకు వెళ్లాలి."
గ్యాంగద్ ఆసక్తిగా ఈ విషయాలన్నీ గమనించసాగాడు. తను ధైర్యం
చేసి చెప్పిన ఐడియా ఇంత మూమెంట్ ఇంత తొందరగా క్రియేట్
చేస్తుందనుకోలేదు.

------------------


ఆ రూంలో మొత్తం పది మంది ఉన్నారు. సుందరాం, గ్యాంగద్, పెదరాయుడు
లతో పాటు మరో ఏడుగురు కొత్తోళ్లు ఉన్నారు. మొత్తం రూంలో పండుగ
వాతావరణం నెలకొంది. అందరి మొహాల్లోనూ ఆనందం ఆనందతాండవం
చేస్తుంది. పెద రాయుడు గారు గొంతు సవరించుకొని మాట్లాడటం
మొదలుపెట్టాడు.
"ఒక ఐడియా మీ జీవితాన్నే మార్చేస్తుంది. ఇది వ్యక్తులకే కాదు
సంస్తలకూ వర్తిస్తుంది. 9 నెళ్ల క్రితం ఈ రూంలో వాతావరణం ఇలా
లేదు. కానీ ఆ రోజు గ్యాంగద్ ఇచ్చిన ఆలొచనతో మన వాళ్లు
అద్భుతమైన ఆచరణతో ఈ రోజు ఇక్కడ ఇలా ఉన్నాం. మన టార్గెట్ కంటే
మూడింతలు ఎక్కువాగా మన రెవిన్యూ వసూలయింది! " అందరూ చప్పట్లు కొట్టి
తమ తమ ఆనందాన్ని వ్యక్తం చేశారు.
" మన హైద్ వారి అడుగు జాడల్లో మిగిల్న నగరాల వాళ్లు కూడా
ముండడుగు వేయడం మనందరికీ గర్వ కారణం.
ఈ రెవిన్యూలో సగం మన ప్యాకేజ్డ్ వెజిటెబుల్స్ హైద్ వెలుపల గ్రామాలు,
పట్టణాల్లో సాధించిందే! ఇలా చూస్తే మన వాళ్లు అంటార్కిటికాలో
మంచు అమ్మ గలరనిపిస్తుంది!"
అందరూ ఒకటే నవ్వులు.
"మరిన్ని వివరాలతో మిమ్మళ్ని బోర్ కొట్టించదలుచుకోలేదు. LET THE
CELEBRATION BEGIN!"