Wednesday, July 30, 2008

siggu siggu

innayya gaarU caduvutunnaaraa?

 

source : http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29main53 

బాబు 'మీకోసం' యా త్ర
ఆపుతానన్నందువల్లే వర్షాలు: బొత్స

వరుణ యాగం వల్లనైతేనేం, కృత్రిమ వర్షాల వల్లనైతేనేం, చంద్రబాబు మీకోసం యాత్ర ఆపుతాను అన్నందువల్లనైతేనేమి.. వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతున్నందువల్ల విద్యుత్‌ కొరత కూడా తగ్గుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షాలు రాకపోవడానికి వ్యక్తులు కారణం అనడం ఎంతవరకు సబబన్న ప్రశ్నకు.. ఇవి మొదటినుండీ వస్తున్నవేనన్నారు. 'పొద్దున్నే లేవగానే ఎవరి మొఖం చూశామో అనేదానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తాం? బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ.. అంటుంటారు పెద్దలు. అంతెందుకు, చరిత్ర చూసుకుంటే ఈ నాలుగేళ్ల పాలనలో పడ్డట్టుగా పూర్తికాలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ వర్షం పడలేదు' అంటూ చెప్పుకొచ్చారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఎందుకు పడట్లేదన్న ప్రశ్నకు తాను ఈ రాష్ట్ర మంత్రినని, రాష్ట్రం వరకే పరిమితమవుతానని, బయటి రాష్ట్రాల గురించి మాట్లాడబోనని సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడటంపైన స్పందిస్తూ... ఆ పార్టీలకు విధానాలు, సిద్ధాంతాలు, దేశం తాలూకు అభివృద్ధి గురించి పట్టదని, కాంగ్రెస్‌ను ఓడించడమే సింగిల్‌ పాయింట్‌ అజెండాగా కలుస్తున్నాయని విమర్శించారు

1 comment:

Anonymous said...

వీలైతే ఈ టపా చదవండి.

http://tetageeti.wordpress.com/2008/07/26/jalayajnam/