Showing posts with label news. Show all posts
Showing posts with label news. Show all posts

Monday, September 29, 2008

మన కోసం తెలుగు దేశం ఫోటోలు


ఆడిటోరియం అలంకరణ
పెద్దలు




జ్యోతి ప్రజ్వలన
వ్యాఖ్యాత
పిన్నలు
నామా నాగేశ్వరరావు గారు
శ్రీనివాస రెడ్డి గారు
నాసా వేత్త


హాల్ ఫుల్ (ఆల్మోస్ట్) ఓ వెయ్యి మంది వరకూ వచ్చారు అని అంచనా.

పిన్నలు
అన్నగారి ఆశీర్వాదాలు


ఐటీ రకతం

Monday, August 18, 2008

ఈ రోజు హిందూ ఎడిటోరియల్ చాలా బాగుంది. తప్పకుండా చదవాలి.

ఈ రోజు హిందూ ఎడిటోరియల్ చాలా బాగుంది. తప్పకుండా చదవాలి.

http://www.hindu.com/2008/08/19/stories/2008081955330900.htm


Ideal and reality: media’s role in India


Wednesday, July 30, 2008

Student commits suicide because of forced English medium!

source: http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29state1

 

ఇంగ్లీషు మింగేసింది!
ిసబిఎస్‌ఇ పాఠాలు అర్థం కావడంలేదని
గురుకుల విద్యార్ధి ఆత్మహత్య

నర్సంపేట, జూలై 29 (ఆన్‌లైన్‌): ఆంగ్ల మాధ్యమ బోధన అర్థంకాక ఆం దోళన చెందుతున్న ఓ గురుకుల విద్యార్థి మంగళవారం పాఠశాల భవనంపై నుంచి దూకి ఆత్మహత్య చేసుకున్నాడు. ప్రత్యక్షసాక్షుల కథనం మేరకు వరంగల్‌ జిల్లా నర్సంపేట మండలకేంద్రంలోని ఆదర్శనగర్‌కు చెందిన దాసరి వంశీ(10) వల్లభ్‌నగర్‌లోని ఆంధ్రప్రదేశ్‌ సాంఘిక సంక్షేమ గురుకుల పాఠశాలలో ఐదవ తరగతి చదువుతున్నాడు. 20 రోజుల క్రితమే పాఠశాలలో చేరిన వంశీ, ఇంటిపై బెంగపెట్టుకున్నాడు. రాష్ట్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన సిబిఎస్‌ఇ ఆంగ్ల మాధ్యమ బోధనకు అతను ఇబ్బంది పడ్డాడు.

గురుకుల పాఠశాలల్లో ఐదో తరగతి నుంచే ప్రారంభమైన ఇంగ్లీషు మీడియం పాఠ్యాంశాలు, తనకు అర్థం కావడం లేదంటూ తమవద్ద వాపోయేవాడని సహచరులు తెలిపారు. తనకీ ఇం గ్లీషు మీడియం వద్దని, తాను ఇంటికి వెళ్లిపోతానని వారితో చెప్పేవాడు. నాలు గు రోజుల క్రితమే అతడిని చూసేందుకు వచ్చిన తల్లిదండ్రులు బుజ్జగించి వెళ్లి నట్లు సమాచారం. ఇంటికి వెళ్లేందుకు అనుమతించాల్సిందిగా కోరినా ఉపాధ్యా యులు నిరాకరించారని తోటి విద్యార్థులతో వంశీ చెప్పాడు.

ఈ నేపథ్యంలో మంగళవారం ఉదయం 8:30 గంటలకు తోటి విద్యార్థులంతా ప్రార్థనలో నిమ గ్నమై ఉండగా, వంశీ పాఠశాల భవనంపై నుంచి దూకాడు. బలమైన దెబ్బలు తగలడంతో ఆస్పత్రికి తరలిస్తుండగా, మార్గమధ్యంలోనే వంశీ మృతిచెందాడు. వంశీ మృతి విషయం తెలియగానే విద్యార్థిసంఘాలు ఆందోళనకు దిగాయి. బాధ్యులైన ఉపాధ్యాయులపై చర్య తీసుకోవాలని కోరుతూ ఎస్‌ఎఫ్‌ఐ, ఎబివిపి నాయకులు పాఠశాలలో బైఠాయించారు. ఘటన వివరాలపై, ఉపాధ్యాయుల నిర్లక్ష్యంపై కలెక్టర్‌కు ఫిర్యాదు చేస్తానని తహశీల్దార్‌ ఇబ్రహీం స్పష్టంచేయడంతో వారు ఆందోళన విరమించారు

siggu siggu

innayya gaarU caduvutunnaaraa?

 

source : http://www.andhrajyothy.com/mainshow.asp?qry=/2008/jul/29main53 

బాబు 'మీకోసం' యా త్ర
ఆపుతానన్నందువల్లే వర్షాలు: బొత్స

వరుణ యాగం వల్లనైతేనేం, కృత్రిమ వర్షాల వల్లనైతేనేం, చంద్రబాబు మీకోసం యాత్ర ఆపుతాను అన్నందువల్లనైతేనేమి.. వరుణ దేవుని కరుణతో రాష్ట్రంలో వర్షాలు కురుస్తున్నాయని గృహనిర్మాణ శాఖ మంత్రి బొత్స సత్యనారాయణ వ్యాఖ్యానించారు. ఇందిరమ్మ ఇళ్లపై ముఖ్యమంత్రి నిర్వహించిన సమీక్షా సమావేశంలో పాల్గొన్న అనంతరం ఆయన విలేఖరులతో మాట్లాడారు. అనుకున్న దానికంటే ఎక్కువగానే వర్షపాతం నమోదవుతున్నందువల్ల విద్యుత్‌ కొరత కూడా తగ్గుతుందన్న ఆశాభావం వ్యక్తం చేశారు.

వర్షాలు రాకపోవడానికి వ్యక్తులు కారణం అనడం ఎంతవరకు సబబన్న ప్రశ్నకు.. ఇవి మొదటినుండీ వస్తున్నవేనన్నారు. 'పొద్దున్నే లేవగానే ఎవరి మొఖం చూశామో అనేదానికి ఎందుకంత ప్రాధాన్యతనిస్తాం? బిడ్డొచ్చిన వేళ, గొడ్డొచ్చిన వేళ.. అంటుంటారు పెద్దలు. అంతెందుకు, చరిత్ర చూసుకుంటే ఈ నాలుగేళ్ల పాలనలో పడ్డట్టుగా పూర్తికాలం ఏ ప్రభుత్వం అధికారంలో ఉన్నప్పుడూ వర్షం పడలేదు' అంటూ చెప్పుకొచ్చారు.

కర్ణాటక, మహారాష్ట్రల్లోనూ వర్షాలు ఎందుకు పడట్లేదన్న ప్రశ్నకు తాను ఈ రాష్ట్ర మంత్రినని, రాష్ట్రం వరకే పరిమితమవుతానని, బయటి రాష్ట్రాల గురించి మాట్లాడబోనని సమాధానం దాటవేశారు. కాంగ్రెస్‌ను ఓడించడానికి టీడీపీ, సీపీఎం, టీఆర్‌ఎస్‌ పార్టీలు కూటమిగా ఏర్పడటంపైన స్పందిస్తూ... ఆ పార్టీలకు విధానాలు, సిద్ధాంతాలు, దేశం తాలూకు అభివృద్ధి గురించి పట్టదని, కాంగ్రెస్‌ను ఓడించడమే సింగిల్‌ పాయింట్‌ అజెండాగా కలుస్తున్నాయని విమర్శించారు